నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పుంగనూరు - జనవరి 03 : అన్నమయ్య జిల్లావ్యాప్తంగా రోడ్డు భద్రతపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ శ్రీ కోయ ప్రవీణ్ ఆదేశాలు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఉత్తర్వుల మేరకు, శనివారం జిల్లాలోని పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనదారులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రమాదాల నివారణకు పలు కీలక సూచనలు చేశారు. చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులపై చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తూ ద్విచక్ర వాహనదారులు ప్రాణరక్షణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన శిక్షలతో పాటు జైలుకు పంపుతామని తీవ్రం గా హెచ్చరించిన సి.ఐ. సుబ్బారాయుడు. ఈ సందర్బంగా సి.ఐ. మాట్లాడుతూ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ‘బ్లాక్ స్పాట్’లను గుర్తించి, అక్కడ వాహనదారులను అప్రమత్తం చేసేందుకు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని సూచనల మేరకు అతివేగం, ఓవర్లోడ్ ప్రయాణాలు ప్రమాదాలకు దారితీస్తాయని, ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని తెలిపారు.
Reporter
Namitha News