Sunday, 26 July 2026 10:03:02 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

మిట్స్ యూనివర్సిటీ లో సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణం లో మెలుకువల పై అవగాహనా కార్యక్రమం

అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ & అమెరికన్ సివిల్ ఇంజినీర్ సొసైటీ ఆధ్వర్యంలో

Date : 22 December 2025 04:24 PM Views : 158

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 22 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్ విభాగము వారు మిట్స్ అల్యూమిని వెల్ఫేర్ అసోసియేషన్ మరియు ఆమెరికన్ సొసైటీ సివిల్ ఇంజనీర్స్ (ASCE) మిట్స్ స్టూడెంట్స్ చాప్టర్ వారి ఆధ్వర్యంలో అధునాతన సివిల్ ఇంజనీరింగ్ నిర్మాణ పద్దతులపై మూడు రోజుల అవగాహనా వర్కుషాప్ ను ప్రారంభించారు.. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పూణే కి చెందిన హిల్టి టెక్నాలజీస్ కంపెనీ లో టెక్నికల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న కళాశాల పూర్వ విద్యార్ధి పి.కార్తీక్ పాల్గొన్నారు. కార్యక్రమం లో ఆయన మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞాన రంగంలో సివిల్ ఇంజనీరింగ్ యొక్క పాత్ర ఎనలేనిదని, మౌలిక సదుపాయాల అభివృద్ధికి, శాస్త్రీయంగా రూపకల్పన చేయబడిన నిర్మాణాలు, వంతెనలు, రహదారులు, నీటి పారుదల వ్యవస్థలు, పట్టణ ప్రణాళిక – ఇవన్నీ సివిల్ ఇంజనీరింగ్ రంగానికి చెందినవన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని సివిల్ ఇంజనీర్లు భవిష్యత్తు అవసరాలను తీర్చగల మౌలిక నిర్మాణాలను రూపొందిస్తున్నారు అని, డిజిటల్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ (BIM) వంటి నూతన సాంకేతికతలు సివిల్ ఇంజనీరింగ్ రంగాన్ని మరింత సమర్థవంతంగా మార్చాయన్నారు. ప్రస్తుత ఆధునిక నిర్మాణ రంగంలో హిల్టి (Hilti) ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ అనేది నిర్మాణ ఇంజినీర్ల కోసం రూపొందించబడిన ఆధునిక ఇంటర్నెట్ ఆధారిత కంప్యూటింగ్ సేవల సమాహార ఆధారిత సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా నిర్మాణాలకు సంబంధించిన బేస్ ప్లేట్లు మరియు స్టీల్ కనెక్షన్ల రూపకల్పన (డిజైన్) మరియు విశ్లేషణను సులభంగా, ఖచ్చితంగా చేయవచ్చు. ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుండైనా ఉపయోగించుకునే సౌకర్యం ఉండటం వల్ల ఇంజినీర్లు తమ పనిని వేగంగా మరియు సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతున్నారు. నిర్మాణ భద్రతను పెంపొందించడంలో, డిజైన్ లోపాలను తగ్గించడంలో హిల్టి ప్రోఫిస్ ఇంజినీరింగ్ సూట్ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్ ఆధునిక నిర్మాణ అవసరాలకు అనుగుణంగా ఇంజినీర్లకు నమ్మకమైన డిజైన్ పరిష్కారాలను అందిస్తుందని తెలిపారు. విద్యార్థులు సాఫ్ట్వేర్ రంగం మీదే ఆధారపడకుండా నిర్మాణ రంగంలోని ఉద్యోగాలలో కూడా రాణించవచ్చని అన్నారు. కార్యక్రమంలో విభాగాధిపతి డాక్టర్ ఎన్.విజయ్ కుమార్, డీన్-స్కూల్ అఫ్ ఇంజనీరింగ్ డాక్టర్ దీపాంకర్ రాయ్, అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ జి.నాగాశ్వేత, కోఆర్డినేటర్ కె. అనిత, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :