Monday, 27 July 2026 05:27:07 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

వైష్ణవి దేవి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు

Date : 12 December 2025 10:58 PM Views : 155

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : చౌడేపల్లి - డిసెంబర్ 12 : చౌడేపల్లి మండలంలోని పుదిపట్ల గ్రామంలో గల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో మార్గశిర మాసం, అష్టమి తిది, శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఉదయం ఆలయ అర్చకురాలు శ్రావణి స్వయంభు శ్రీ వైష్ణవి దేవి, అభయాంజనేయ స్వామి, నాగభైరవ స్వాములకు పంచామృత అభిషేకం చేశారు. అనంతరం అమ్మవారిని వివిధ రకాల రంగురంగుల పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అష్టమి ప్రత్యేకతగా నాగభైరవ స్వామి సన్నిధిలో భక్తులు పంచదీపారాధనలు సమర్పించారు. కుజదోషం, సర్పదోషం నివారణకు, వివాహం కాని వారు, సంతానం కోరిక ఉన్న వారు, అనారోగ్యంతో ఉన్న భక్తులు అష్టమి రోజున పంచదీపారాధన చేయడం శ్రేయస్కరమని ఆలయ అర్చకురాలు తెలిపారు. చౌడేపల్లి, పుంగనూరు, మదనపల్లి మరియు పరిసర గ్రామాల భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు. హైద‌రాబాద్‌కు చెందిన శ్రీకాంత్, ధర్మపత్ని ఉమామహేశ్వరి ఉభయ దారులుగా సేవలు అందించారు. ఆలయ ధర్మకర్త వినోద్‌కుమార్ భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :