నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె పట్టణం, కజిన్స్ వీధిలోని జీయాన్ ఈఎన్టీ పాయింట్ నందు రేపు అనగా శుక్రవారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మాజీ డిసిహెచ్ఎస్, ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ పాల్ రవికుమార్ తెలిపారు. బుధవారం స్థానిక కజిన్స్ స్ట్రీట్ లోని జియాన్ ఈఎన్టి పాయింట్ నందు డాక్టర్ పాల్ రవికుమార్ విలేకరులతో మాట్లాడుతూ గత 23 సంవత్సరాలుగా తమ సోదరి, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ పట్టణ ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. శుక్రవారం నిర్వహిస్తున్న 23వ ఉచిత మెగా వైద్య శిబిరంలో చెవి, ముక్కు గొంతు, తల, మెడ కు సంబంధించిన వ్యాధులకు చికిత్సలు, దీంతోపాటు చర్మవ్యాధులు, దంత సమస్యలు, క్యాన్సర్ జబ్బులకు నిష్ణాతులైన వైద్యులచే ఉచిత పరీక్షలు, చేసి, ఉచిత మందులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కావున ఈ సదవకాశాన్ని పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Reporter
Namitha News