నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 ః తంబళ్లపల్లె నియోజకవర్గం లోని ఆరు మండలాల అధికారులు ప్రభుత్వం రెండేళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రణాళిక నివేదికలను సిద్ధం చేయాలని జిల్లా రెవిన్యూ అధికారి తంబళ్లపల్లె స్పెషలాఫీసర్ చంద్రశేఖర్ రెడ్డి సూచించారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో ఆరు మండలాల మండల స్థాయి అధికారులు తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జలధార-జల హారతి నిర్వహణ, పండ్ల తోటల పెంపకం, తల్లికి వందనం, పాఠశాలల స్థితిగతులు,విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీ వివరాలు, రైతుభరోసా, విత్తన కాయల పంపిణీ, ప్రకృతి వ్యవసాయం, వ్యవసాయ పరికరాలు పంపిణీ వివరాలు, వృద్ధాప్య, వితంతు, వికలాంగుల, ఒంటరి మహిళల పెన్షన్లు పంపిణీ, కొత్త పెన్షన్లకు వచ్చిన దరఖాస్తుల వివరాలు, మండలంలో తాగునీరు కోసం జలజీవన్ మిషన్ పనుల నిర్వహణ వివరాలు, 20 47 విజన్ లో నియోజకవర్గానికి మంజూరైన పనులు చేసిన అభివృద్ధి, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత గ్యాస్ సిలిండర్, గ్రామాల్లో సిసి రోడ్లు, మురికినీటి కాలువలు, తారు రోడ్లు వివరాలు, వెలుగు లో మహిళా సంఘాలకు రుణాలు పంపిణీ వివరాలు, ఐసిడిఎస్ లో పిల్లలకు పౌష్టికాహార పంపిణీ, ఇరిగేషన్ చెరువుల అభివృద్ధి పనుల వివరాలు, ఎన్టీఆర్ వైద్య సేవ, 108, 104 సేవలు, ప్రభుత్వం చేపట్టిన సూపర్ సిక్స్ తో పాటు అభివృద్ధి, సంక్షేమ ప్రణాళిక నివేదికలు సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో పెతేరు ప్రాజెక్ట్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి,ఎంపీడీవో ఉషారాణి, ఎంఈఓ త్యాగరాజు, డిప్యూటీలు ఎం వి ప్రసాద్, మారుతీ కుమార్, ఏపిఎం గంగాధర్, ఏపీవో అంజనప్ప, ఏఈఈ వినోద్ కుమార్, సతీష్, వెంకటరమణ, సుజాత, నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంపీడీవోలు, పలు శాఖల మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు
Reporter
Namitha News