నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - జనవరి 30 : పట్టణంలోని నాలుగవ వార్డు పరిధిలో జేఆర్ పేట నందు విద్యుత్ సమస్యలను నివారించే క్రమంలో నూతన ట్రాన్స్ఫారం ఏర్పాటు చేశారు.. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారిని కలిసి ట్రాన్స్ఫార్మర్ మంజూరు కొరకు విజ్ఞప్తి చేయగా వారి సహకారంతో ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసినట్లు స్థానిక నివాసి 20వ వార్డు కౌన్సిలర్ సురా భాస్కర్ రెడ్డి తెలిపారు.. ఈ ప్రాంతంలో లో వోల్టేజ్ సమస్య పరిష్కారానికి వేగవంతంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేసిన విద్యుత్ శాఖ ఏడిఈ చిన్నస్వామి నాయక్, పట్టణ ఏఈ జమీల బేగం ఇతర విద్యుత్ సిబ్బంది కు ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు.. మొదట ట్రాన్స్ఫార్మర్ కు పూజా కార్యక్రమం నిర్వహించారు.. అనంతరం ట్రాన్స్ఫార్మర్ ను ఏడిఈ చిన్నస్వామి నాయక్ ఆన్ చేసి విద్యుత్ సరఫరాను కొనసాగించారు. ఈ కార్యక్రమానికి వీధివాసులు హాజరయ్యారు.. తమ ప్రాంతంలోని లో వోల్టేజ్ సమస్యను పరిష్కరించి నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు విద్యుత్ అధికారులకు వీరు ధన్యవాదాలు తెలిపారు.. ఏడిఈ చిన్నస్వామి నాయక్ మాట్లాడుతూ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుతో ఈ ప్రాంతంలోని సుమారు 150 ఇళ్లకు లో వోల్టేజ్ విద్యుత్ సమస్య తీరిందని త్వరలో పట్టణంలోని మరో మూడు ప్రాంతాలలో నూతన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు
Reporter
Namitha News