నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న నాగూర్ వలి - ఎమ్మెల్యేకి శుభాకాంక్షలు తెలిపి ఘనసన్మానం మదనపల్లె : నూతన సంవత్సరం - 2026ని పురస్కరించుకొని గురువారం పట్టణంలో జరిగిన వేడుకలలో ఏపీఎస్ఆర్టీసీ 1,2 డిపోల ఎంప్లాయిస్ యూనియన్ గౌరవాధ్యక్షులు నాగూర్ వలి (షో ఆప్ శీనా) పాల్గొన్నారు.ముందుగా ప్రజల అభిమాన నాయకుడు ఎమ్మెల్యే షాజహాన్ బాషాకి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు నాగూర్ వలిని ఆయన నివాసంలో ఘనంగా సన్మానించారు.నిమ్మనపల్లి సర్కిల్ నందు జనసేన నాయకులు అడపా సురేంద్ర,తోట కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి నాగూర్ వలి హాజరు కాగా వారు శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాగూర్ వలి 2026 మదనపల్లి వాసులకు ప్రత్యేకమైందన్నారు.కొన్ని దశాబ్దాల కల నెరవేరి జిల్లా కేంద్రంగా ఏర్పాటయిన వేళ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొందన్నారు.జిల్లా విజయోత్సవ సంబరాలు,నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయన్నారు.ఎమ్మెల్యే షాజహాన్ బాషా నాయకత్వంలో మదనపల్లి జిల్లా అభివృద్ధిలో సరికొత్త పుంతలు తొక్కుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మదనపల్లి-1 డిపో కార్యదర్శి కే.ఈశ్వరప్ప,రెండవ డిపో కార్యదర్శి పూల శ్రీనివాసులు,వర్కింగ్ ప్రెసిడెంట్ రాజన్న,ఎంసీ శేఖర్,జాయింట్ సెక్రటరీలు బి.మధు,హరిబాబు మరియు ఎంప్లాయిస్ యూనియన్ సభ్యులు ఉత్తన్న,వైవి వెంకట నర్సు,గంగులప్ప,చరణ్ సింగ్,ప్రెసిడెంట్ యు.నరసింహులు గ్యారేజీ సెక్రటరీ జాఫర్ వలి,ఎం.సురేష్,ఎస్.బావాజా న్,బిసిఎస్ నాయక్,నాయక్,ఎం.శంకరప్ప,వక్కల చలపతి,సి.రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News