Monday, 27 July 2026 10:53:23 AM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

శాంతియుత నిరసన తెలిపిన కాంగ్రెస్ పై దౌర్జన్యం హాస్యాస్పదం

AI సదస్సు వేదికగా చైనా కుక్క బొమ్మతో (ROBO )దేశ పరువును మోడీ గారు తీస్తే, కాంగ్రెస్ శాంతియుత నిరసన

Date : 23 February 2026 07:45 AM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - ఫిబ్రవరి 23 : ఢిల్లీ లో జరిగిన AI సదస్సు వేదికగా చైనా కుక్క బొమ్మతో (ROBO )దేశ పరువును మోడీ గారు తీస్తే, కాంగ్రెస్ శాంతియుత నిరసన తెలిపితే ఉగ్రవాదం అంటారా.. ప్రజల నుంచి కాంగ్రెస్ కు మద్దతు పెరుగుతుంటే చూసి ఓర్వలేక ఉగ్ర కోణం అని బిజెపి వాదించడం అత్యంత దారుణం. ఇది కేంద్ర ప్రభుత్వ దిగజారుడుతనానికి నిదర్శనం. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ సందర్భంగా Indian Youth Congress చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఒక రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్య హక్కు. పాలకులు తీసుకొనే నిర్ణయాలు సరిగా లేకపోతె ప్రతిపక్షాలకు ప్రశ్నించే హక్కు రాజ్యాంగ బంధం. అభిప్రాయ భేదాలు ఉన్నప్పుడు చర్చలు, సంభాషణల ద్వారా పరిష్కారం కనుగొనాలి గానీ, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయడం హేయమైన చర్య, ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనంతపురం మరియు కర్నూలు జిల్లాల్లో కాంగ్రెస్ కార్యాలయాలపై దాడి చేయడం, గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై దాడికి యత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ భేదాలను హింసగా మార్చడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలహీనపరచే చర్య. ప్రభుత్వం వెంటనే ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. హింసకు బదులు చర్చ, ద్వేషానికి బదులు ప్రజాస్వామ్య సంభాషణ ఉండాలి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. ఈ రోజు అధికారంలో ఉన్న బీజేపీ వారు రేపు ప్రతిపక్షంలో ఉండవచ్చు.... రేపు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అవకాశం ఇస్తారు. అందుకే అధికారాన్ని అహంకారంగా కాక, బాధ్యతగా చూడాలి. శాంతి, సామరస్యాన్ని కాపాడటం ప్రతి రాజకీయ పార్టీ బాధ్యత. ప్రజలు హింసను తిరస్కరించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: