నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 31 : మండలంలో కుష్ఠువ్యాధి నివారణ కోసం వైద్య సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో తరిమికొడదామని కోసువారిపల్లి పి.హెచ్.సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సాదియా పిలుపునిచ్చారు. శనివారం ఐకెపి కార్యాలయంలో కుష్టి వ్యాధి లక్షణాలు, నివారణోపాయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎం.ఎల్.హెచ్.పి కీర్తి కుష్టు వ్యాధి మైకో బ్యాక్టీరియా లెప్రే అనే బ్యాక్టీరియా వలన సంక్రమిస్తుందని,తుమ్ములు, దగ్గు వలన ఈ వ్యాధి వ్యాపిస్తుందని చర్మంపై స్పర్శ లేని రాగి రంగు మచ్చలు, నొప్పితో కూడిన నరాలు, కాళ్లు చేతులు బలహీనత, కాళ్లు నుండి చెప్పులు కారిపోవడం దా పలు లక్షణాలు విసిదీకరించారు. కుష్టు వ్యాధి నివారణకు ప్రభుత్వం ఎండిటి (మల్టీ డ్రగ్ థెరపీ) ద్వారా ఉచితంగా మందులు పంపిణీ జరుగుతుందన్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులు ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య సిబ్బంది వద్ద మందులు ఉచితంగా పొంది డోస్ కచ్చితంగా వాడితే పూర్తిగా నయం అవుతుందని తెలిపారు. కుష్టి వ్యాధి గ్రస్తులను గుర్తించి నివారణకు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఓ థామస్ రాజా, ఎంఈఓ త్యాగరాజు, ఎం ఎల్ హెచ్ పి సిమ్రాన్, మేల్ వర్కర్ కృష్ణా నాయక్, టీ.బి సూపర్వైజర్ రామకృష్ణ,ఏఎన్ఎం ఖతిజా, సి సి లు కత్తి నరసింహులు, ఆదిలక్ష్మి,టిడిపి నాయకులు శివకుమార్, మధు నాయుడు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News