నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూన్ 22 : రాజ్యాంగ సృష్టికర్త దళితుల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో మాదిగ రిజర్వేషన్ల సాధన కర్త మందకృష్ణ మాదిగ పిలుపు, అధికార ప్రతినిధి నరేంద్ర మాదిగ సూచనలతో ప్రతి దళితవాడ జల్లెడ పట్టి మాదిగ బిడ్డల చదువు కోసం తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ తంబళ్లపల్లె ఇంచార్జ్ వేటా మల్లికార్జున తెలిపారు. సోమవారం మండలంలోని ఆర్ ఎన్ తాండ , కొటాల దళిత వాడల్లో మాదిగ కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులకు చదువు యొక్క ఉపయోగాల పై అవగాహన కల్పించి నేటి ఆధునిక సమాజంలో చదువుతో విజ్ఞానంతో పాటు వికాసం, ఆర్థిక సమానత్వం, సమాజంలో గౌరవం, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరడానికి మూల కారణమని హితవు పలికారు. దళితవాడలోని ప్రతి విద్యార్థిని కచ్చితంగా బడికి పంపించి ఉన్నత చదువులు చదవడానికి మీరు సమిధలుగా మారి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కోరారు. వారి వెంట ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, దళిత కుటుంబాల తల్లిదండ్రులు పాల్గొన్నారు
Reporter
Namitha News