నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 08 : తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి పంచాయతీకి గ్రామ పంచాయతీ భవనం మంజూరు అయింది. ఈ భవన నిర్మాణానికి ఇరువర్గాల మధ్య భూ వివాదం చెలరేగి రచ్చకెక్కింది. భవన నిర్మాణానికి పంచాలమర్రిలో ఎల్పిఎం నెంబర్ 17 46 లో 0.05 సెంట్లు భూమి రెవిన్యూ, మండల పరిషత్ అధికారులు ధ్రువీకరించారు. పంచాయతీ భవనం నిర్మాణానికి అధికార పార్టీ నాయకులు భూమిని చదును చేయగా ఓ వ్యక్తి ఆ భూమి తాను కొన్నానని ఆ స్థలం నాకు చెందిందని లాయర్ నోటిస్ తో పాటు ఆ స్థలంలో తాత్కాలిక రేకుల షెడ్డు ఏర్పాటు చేయడంతో వివాదం చెలరేగింది. ఈ విషయమై గ్రామ సర్పంచ్ నాగేంద్రబాబు స్థానిక కార్యదర్శి ఈశ్వర్ రెడ్డి తోపాటు మండల పరిషత్ అధికారులకు ఫిర్యాదు చేయగా మండల పరిషత్ అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలని జిల్లా ఉన్నతాధికారులకు నివేదికలు పంపినట్లు అధికారులు విలేకరులకు తెలిపారు.
Reporter
Namitha News