నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 29 : అన్నమయ్య జిల్లా మండలంలోని ఊలపాడు గ్రామ పంచాయతీ దిన్ని పల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ మైదానం లో శనివారం మండల ఉపాధ్యాయుల కు ఆటల పోటీలు జరిగాయి. మండల స్థాయిలో పురుషులు ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుండీ 50 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈరోజు మండల స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులు డిసెంబర్ 12వ తేదీన డివిజన్ లెవెల్ లో ఆ తర్వాత గెలిచినవారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులలో మానసిక ఉత్సాహానికి ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలు అలాగే త్రో బాల్ పోటీలలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో రామసముద్రం, చెంబకూరు, చొక్కాండ్ల పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు,రమేష్ బాబు, శ్రీనివాసులు,ఎస్.టి.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి ఎస్.టి.యు. మండల అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి , ఉన్నత పాఠశాల పీడీలు పార్థసారథి ,మోహన్, పవన్ ,రమాదేవి, ఇందిరా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నాగరాజా ఎస్టీయూ నాయకులు నరసింహులు, ప్రకాష్ రెడ్డి, అనిల్ కుమార్, సుధాకర్, కేశవ కుమార్, కుసుమ , లక్ష్మీ శాంతి, రెడ్డమ్మ, భార్గవి, శ్వేత, మంజుల తదితరులు పాల్గొన్నారు.
Admin
Namitha News