Monday, 27 July 2026 01:16:53 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఉపాధ్యాయులకు ఆటలు పోటీలు

Date : 29 November 2025 06:41 PM Views : 295

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 29 : అన్నమయ్య జిల్లా మండలంలోని ఊలపాడు గ్రామ పంచాయతీ దిన్ని పల్లె గ్రామ సమీపంలో ఉన్న ఏపీ మోడల్ స్కూల్ మైదానం లో శనివారం మండల ఉపాధ్యాయుల కు ఆటల పోటీలు జరిగాయి. మండల స్థాయిలో పురుషులు ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు, మహిళా ఉపాధ్యాయులకు త్రోబాల్ పోటీలు నిర్వహించారు. మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుండీ 50 మంది ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి ఆంజనేయులు మాట్లాడుతూ ఈరోజు మండల స్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొందిన ఉపాధ్యాయులు డిసెంబర్ 12వ తేదీన డివిజన్ లెవెల్ లో ఆ తర్వాత గెలిచినవారు జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఆడాల్సి ఉంటుందని చెప్పారు. ఉపాధ్యాయులలో మానసిక ఉత్సాహానికి ఈ ఆటలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ పోటీలు అలాగే త్రో బాల్ పోటీలలో గెలుపొందిన వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం లో రామసముద్రం, చెంబకూరు, చొక్కాండ్ల పల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టిబాబు,రమేష్ బాబు, శ్రీనివాసులు,ఎస్.టి.యు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల మురళి రాష్ట్ర కమిటీ కన్వీనర్ సుబ్బారెడ్డి ఎస్.టి.యు. మండల అధ్యక్షుడు ఆయూబ్ ఖాన్ ప్రధాన కార్యదర్శి రమాదేవి , ఉన్నత పాఠశాల పీడీలు పార్థసారథి ,మోహన్, పవన్ ,రమాదేవి, ఇందిరా మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు నాగరాజా ఎస్టీయూ నాయకులు నరసింహులు, ప్రకాష్ రెడ్డి, అనిల్ కుమార్, సుధాకర్, కేశవ కుమార్, కుసుమ , లక్ష్మీ శాంతి, రెడ్డమ్మ, భార్గవి, శ్వేత, మంజుల తదితరులు పాల్గొన్నారు.

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :