నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - డిసెంబర్ 06 : అంగళ్ళు సమీపం లోని మిట్స్ డీమ్డ్డ్ టు బి యూనివర్సిటీ నందు అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం లో భాగంగా ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.. కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామనాథన్, మాట్లాడుతూ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ద్వారా ప్రతి విద్యార్థి విద్యా మరియు వృత్తిపరమైన విజయానికి అవసరమైన జ్ఞానం మరియు నైపుణ్యాలను పొందేలా చేస్తుంది అని అన్నారు. రెగ్యులర్ అసెస్మెంట్లు మరియు ఫీడ్బ్యాక్ మెకానిజమ్లు బోధనా పద్ధతులు, పాఠ్యాంశాల రూపకల్పన మరియు మొత్తం విద్యా పనితీరును మెరుగుపరచడంలో ఈ అవుట్ కమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ సహాయపడతాయి అని అన్నారు. వాస్తవ-ప్రపంచ అనువర్తనాలతో విద్యా అభ్యాసాన్ని అనుసంధానించడం ద్వారా, ఈ ఓబీఈ పరిశ్రమ డిమాండ్లు మరియు సవాళ్లను ఎదుర్కోవడానికి బాగా సిద్ధంగా ఉన్న గ్రాడ్యుయేట్లను ఉత్పత్తి చేస్తుంది అని అన్నారు. ఈ రెండు రోజుల పాటు ఈ వర్క్ షాప్ మీ అందరికి మంచి ఫలితాలను ఇచ్చిందని, ఆశిస్తున్నానని ఆయన అన్నారు. విద్య విధానం స్కూల్ స్థాయిలో నుండే చేయడం వలన విద్యార్థులలో మంచి ఫలితాలు సాధించ వచ్చు అని, ఈ అవుట్ కంబేస్డ్ ఎడ్యుకేషన్ కార్యక్రమం మిట్స్ యూనివర్సిటీ వరకే పరిమితం కాకుండా అధ్యాపకుల అందరికి అందిచలానే ఉద్దేశంతో వర్క్ షాప్ నిర్వహించామని ఆయన అన్నారు. ఈ వర్క్ షాప్ కు వివిధ ప్రాంతాల నుండి పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు హాజరు అయ్యారు అని వారికి సర్టిఫికెట్స్ అందజేశారు.
Reporter
Namitha News