నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 10 : పీఎం సూర్య ఘర్ పథకంలో సోలార్ పవర్ ఏర్పాటుతో వినియోగదారులు మూడు దశాబ్దాల పాటు కరెంటు బిల్లు చెల్లించకపోగా ఆదాయం సమకూరుతుందని యాక్సిసో గ్రీన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు బెదురు ఇల్లేష్ ,బాలమురుగన్ లు పిలుపునిచ్చారు. బుధవారం ఐకెపి కార్యాలయంలో ఏపీఎం గంగాధర్ ఆధ్వర్యంలో పి యం సూర్యఘర్ సోలార్ పవర్ ఉపయోగాలపై మహిళా సంఘాలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బాలమురుగన్ మాట్లాడుతూ ఒకసారి సోలార్ రూప్ టాప్ ఇంస్టాలేషన్ చేసుకుంటే 30 ఏళ్లపాటు నాణ్యమైన విద్యుత్తు తోపాటు విద్యుత్ చార్జీలు ఉండవని సూర్యఘర్ పథకంలో సబ్సిడీతో ప్రతి మహిళా సభ్యురాలు సోలార్ రూట్ టాప్ ఇన్ స్టాలేషన్ చేసుకొని ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఏపీఎం గంగాధర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో సూర్యఘర్ పథకం సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో విద్యుత్ బిల్లుల సమస్యను అధిగమించి ఆదాయం పెంచుకోవాలని సూచించారు. సోలార్ పవర్ రూప్ టాప్ చేయించుకునే లబ్ధిదారులు ఈ ఫోన్ నెంబర్(8688267029)ను సంప్రదించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐకెపి సీసీలు కత్తి నరసింహులు, రమణ , ఆదిలక్ష్మి, భాష,సంఘమిత్రలు, మహిళ సభ్యులు పాల్గొన్నారు.
Reporter
Namitha News