నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - డిసెంబర్ 04 : రామసముద్రం మండలం లోని పెద్దకురప్పల్లె గ్రామ పంచాయతీ తిరుమలరెడ్డిపల్లె గ్రామంలో సైబర్ నేరాలపై ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో ఏ ఎస్సై హిమాచలపతి అధ్యక్షతన గురువారం క్రైమ్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఏ ఎస్సై మాట్లాడుతూ క్రైమ్, సైబర్ నేరాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాలు మేరకు గురువారం గ్రామంలో పర్యటించి గ్రామస్థులతో నేరుగా ముచ్చటించి వివిధ నేరాలపై భద్రత ప్రమాణాలపై గురించి ప్రజలకు క్లుప్తంగా వివరించారు. సైబర్ నేరగాళ్లు ప్రజలను ఎదోవిధంగా మోసాలు చేస్తూ డబ్బులు దోచుకుంటున్నారన్నారు. వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అపరచిత వ్యక్తులు కాల్ చేసి మీకు ఓ టి పి వస్తుందని మీరు చెప్పాలని అని అడుగుతారని మీరు ఓ టి పి నంబర్ చెప్పకండి అని ప్రజలకు తెలియజేసారు. వర్షాలు పడే కాలం కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు దగ్గరకు వెళ్ళనీకుండా మీరు చూడాలన్నారు. మీ గ్రామంలో ఎవ్వరైనా అపరిచితులు సంచారం చేయడం, దోపిడీకి చేయడానికి ఆస్కారం ఉంటుందని అటువంటి వారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మీకు ఎవ్వరిపైన సందేహం కలిగితే పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ఏ ఎస్సై హిమాచలపతి, కానిస్టేబుల్ బాలాజీ గ్రామస్థులు కైకాల కుమార్ స్వామి, సందూరి సర్దార్ బాషా,బాబుసాబ్(తారక్) వెంకటలక్ష్మమ్మ, చంద్రశేఖర్ రాజు,నారాయణ గౌడ్,సి. నారాయణ,ఆకుతోట నారాయణ, తిరుపతి నాయుడు,అనిల్ గౌడ్, దివ్యశ్రీ,చిన్ని, సుభాన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News