నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 10 : తంబళ్లపల్లె మండలం రేణుమాకులపల్లి పంచాయతీ మిట్టమాలపల్లి కు చెందిన జి రెడ్డప్ప చిత్తూరు ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్నాడు. సోమవారం తెల్లవారుజామున 8 గంటల ప్రాంతంలో రెడ్డప్పకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రెడ్డప్ప మృతి చెందాడు. ఆయన మృతితో రేణుమాకులపల్లి పంచాయతీలో విషాదఛాయలు ఉన్నాయి. మంగళవారం మిట్టమాలపల్లిలో రెడ్డప్ప ధనక్రియలు నిర్వహిస్తారని కుటుంబ సభ్యులు తెలిపారు.
Reporter
Namitha News