Sunday, 26 July 2026 01:12:25 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఎస్సి,ఎస్టీ సంక్షేమ పథకాలను పునరుద్దించాలంటూ మంత్రి కి వినతిపత్రం సమర్పించిన శ్రీచందు

సబ్ ప్లాన్ మరియు ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలు సత్వరమే మంజూరు చేయాలి

Date : 20 January 2026 11:09 AM Views : 141

నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : అమరావతి - జనవరి 20 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములో ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన, గత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను తిరిగి పునరుద్ధరించాలని, కూటమి ప్రభుత్వం ఏర్పాటుఅయి 20 నెలలు కాలం గడుస్తున్న ఈ సంక్షేమ పథకాల ఊసే ఎత్తకపోవడం విచారకరమని ఆవేదన చెందుతున్నామన్నారు. దళితులకు 50 సంవత్సరాలకే పెన్షన్, జీవో నెంబర్ 3, సబ్ ప్లాన్ నిధుల పంపిణీ, గత ప్రభుత్వం రద్దు చేసిన 20 సంక్షేమ పథకాలను పునరుద్ధరణ చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాల వీరాంజనేయులు గారిని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు కలిశారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీల పట్ల జరుగుతున్న అన్యాయాలపై, ఒక వినతి రూపంలో ఆయన కందించారు. మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరతిగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల పరిష్కారముకు ముందు ఏర్పాటు చేసిన" స్పెషల్ డియస్పీ" విధానం బాగా పనిచేయడం వల్ల సత్ఫలితాలు వచ్చాయని, కానీ ఇప్పుడు ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసులలో పై విధానం లేక సాధారణ డి.ఎస్. పి లు పని వత్తిడితో పరిమితి సమయంలో చార్జ్ షీట్ దాఖలు చేయలేక సుప్రీం కోర్టులు తీర్పులు ఉన్నా అట్రాసిటీ కేసుల్లో 41నోటిస్లు ఇస్తూ అట్రాసిటీ చట్టం యొక్క ఉద్దేశ్యంను పరోక్షంగా దెబ్బతీసేలా ఉందని ఆవేదన చెందారు. ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో 6సాంఘిక సంక్షేమ శాఖ మరియు రెవెన్యూ శాఖ సంయుక్తముగా పనిచేసి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు న్యాయం చేయాలి కానీ అందుకు భిన్నముగా బాధితులకు కాంపొజిషన్ ఫండ్ ఇవ్వకుండా కాలయాపన చేయడమే కాక అట్రాసిటీ కేసుల్లో బాధితులు చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని భర్తీ చేయడంలో చాలా అలసత్వం చూపిస్తున్నారు. రాష్ట్రంలో చాలా జిల్లాలలో ఎస్సీ ఎస్టీ వాడలకు స్మశానాలు ఉన్న ఆ స్మశానాలకు దారి సమస్యలు చాలా ఉన్నాయి. స్మశానాలు లేని వాడలకు స్మశానం కల్పించి, దారి సమస్య ఉన్న వాళ్లకు ప్రజా ప్రయోజనాల నిమిత్తం భూమి చట్టం ప్రకారం దారులను ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం కు చర్యలు తీసుకోవాలని , రాష్ట్రంలో మరియు టీటీడీ సంస్థలో పెండింగ్లో ఉన్న బ్యాక్ లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేస్తూ రూల్ ఆఫ్ రిజర్వేషన్ల విధానం ను పాటించాలని, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు మంజూరు చేసి సూక్ష్మ ఎస్సి, ఎస్టీ పారిశ్రామికు లకు సబ్సిడీ రుణాలు అందించాలని, పై సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం స్పందించేలా తమరు చర్య తీసుకుని ఎస్సీ ఎస్టీ ప్రజలకు మరియు భాధితులకు న్యాయం చేయాలని కోరామని తెలిపారు

RAVI KUMAR REDDY

Admin

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :