నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - డిసెంబర్ 16 : మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, మదనపల్లి కు జాతీయ స్థాయీ లో టాప్ 20 కళాశాల గా ఏ.ఏ.ఏ (AAA) రేటింగ్ లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్ తెలిపారు . జాతీయ స్థాయిలో యెన్.పీ.టి.ఈ.ఎల్ వారు ఆన్లైన్ లో జులై - డిసెంబర్ 2025 సెషన్ లో నిర్వహించిన పరీక్షలలో కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు మొత్తం 9224 సర్టిఫికెట్ కోర్సెస్ కు హాజరు కాగా అందులో 7155 ప్రతిభ కనపరిచి జాతీయ స్థాయి లో యెన్.పీ. టీ. ఈ. ఎల్ సర్టిఫికెట్ ను పొందడమే కాక, 142 మందికి గోల్డ్ రేటింగ్, సిల్వర్ 1419 మరియు ఎలైట్ 3623 కి లభించిందని అంతే కాకుండా కళాశాలకు AAA రేటింగ్ తో పాటు టాప్ 20 లో మిట్స్ కళాశాలకు జాతీయ స్థాయిలో 11 వ ర్యాంక్ మరియు రాష్ట్ర స్థాయిలో 2 వ ర్యాంక్ గా గుర్తింపు ను అందించినట్లు ఆయన అన్నారు. కళాశాల కు యెన్.పీ. టీ. ఈ. ఎల్ వారు అందించిన ఈ గుర్తింపుకు కృషి చేసిన విద్యార్థులు మరియు అధ్యాపకులు చేసిన కృషికి మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ యెన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ యన్. ద్వారకానాథ్ మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల విద్యార్థులు మరియు అధ్యాపకులు కు కృతజ్ఞతలు తెలిపారు.
Reporter
Namitha News