Monday, 27 July 2026 01:18:10 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

కన్నప్రేగుకు భారమైన పురిటిబిడ్డను వదిలేసిన మాతృమూర్తి ఎవరు ... ?

గుర్తు తెలియని ఆడ శిశువు మృతి

Date : 29 April 2026 10:25 PM Views : 173

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - ఏప్రెల్ 29 : కన్నప్రేగుకు భారమై పురిటిబిడ్డను గుర్తు తెలియని మాతృమూర్తి పంటపొలాల్లో వదిలేసిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని చెంబకూరు నుండి ఎలకపల్లి మార్గంలోని పొలాల్లో గుర్తు తెలియని పురిటి శిశువు శవం కలకలం రేపింది. బుధవారం వ్యవసాయ పనినిమిత్తం పొలంలోకి వెళ్లిన ఒక మహిళకు రోజులు కూడా నిండని ఒక ఆడశిశువు శవమై కనిపించడంతో భయంతో పరుగులు తీసింది. విషయం తెలుసుకొన్న మహిళ భర్త సురేంద్ర పోలీసులకు విషయం తెలియచేశాడు. అనంతరం సంఘటన స్థలానికి రామసముద్రం తహసీల్దార్ మహమ్మద్ అజరుద్ధున్, ఎస్సై హృషి కేశవరెడ్డి సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని విచారించి పసిపాప మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అనంతరం ఎస్సై మాట్లాడుతూ సంఘటనకు సంబంచిన వివరాలని శవ పంచనామా అనంతరం తెలియచేస్తామని అన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :