నమిత న్యూస్ - Andhra Pradesh / AMARAVATHI : ములకలచెరువు నకిలీ మద్యం కేసులో టిడిపి నాయకులు జయచంద్రారెడ్డి ని వదిలేసి మాజీ మంత్రి, బిసి నేత జోగి రమేష్ ను అరెస్ట్ చేయడం దారుణం.... సిబిఐ దర్యాప్తు చెస్తే అసలు దోషులు బయటకు వస్తారు.... ఇప్పటి వరకు జయచంద్రారెడ్డి ని అరెస్ట్ చేయకపోవడంలో ఉన్న కారణాలు ఏమీటీ -- సూటిగా ప్రశ్నించిన మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ -- తంబళ్లపల్లె కోర్టు వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తోకలిసి జోగి రమేష్ ను కలవడానికి వెళ్ళిన నిసార్ అహమ్మద్ నకిలీ మద్యం కేసులో అసలైన దోషి జయచంద్రారెడ్డిని వదిలేసి మాజీ మంత్రి, బిసి వైసిపి నేత జోగి రమేష్, జోగి రాము లను అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమే అని మదనపల్లె వైసిపి సమన్వయకర్త నిసార్ అహమ్మద్ ఆరోపించారు. తంబళ్లపల్లె కోర్టు వద్ద ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తోకలిసి జోగి రమేష్ ను కలవడానికి నిసార్ అహమ్మద్ వెళ్ళారు. ఈ సందర్భంగా నిసార్ అహమ్మద్ మాట్లాడుతూ ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిడిపి నాయకులు జయచంద్రారెడ్డి ని ఇప్పటి వరకు అరెస్ట్ చేయకపోవడంలో వున్న కారణాలు ఏమిటని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి అసలు సూత్రధారి అంటూ సాక్షాత్తు టిడిపి వారే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ఆరోపించారు. సిఎం చంద్రబాబునాయుడు కు వ్యతిరేకంగా మాట్లాడారనే అక్కసుతో జోగి రమేష్ ను అక్రమ కేసులో ఇరికించి కోర్టుల చుట్టూ తిప్పుతున్నారని ఆరోపించారు. జోగి రమేష్, జోగి రాము పైన కుట్ర పూరితంగా కేసులు నమోదు చేసారని సిట్ దర్యాప్తు వద్దని సిబిఐ తో దర్యాప్తు చేయించి నిజాన్ని నిగ్గు తేల్చటానికి కూటమి ప్రభుత్వం సిద్ధం కావాలని సూచించారు. కోర్డులు, దర్యాప్తు సంస్థలపై మాకు అపార నమ్మకం వుందని సిబిఐ దర్యాప్తుతోనే అసలు దోషులు బయటకు వస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News