Monday, 27 July 2026 12:08:22 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

విబిజీ రాంజీ పథకం తో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని దినాలు

Date : 02 July 2026 07:52 PM Views : 133

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబల్లపల్లి - జూలై 02 : విబిజీ రాంజీ పథకం తో ప్రతి కుటుంబానికి 125 రోజులు పని కల్పించడమే వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజగార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ పథకం(విబిజి రామ్ జి) ముఖ్య ఉద్దేశ్యం అని గురువారం డిప్యూటీ ఎంపిడివో లతో ఏపీఓ అంజనప్ప లు కలిసి ముఖ్యమంత్రి వర్యులు వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.ఈ ఏడాది జులై నెల 2 వ తేదీ నుండి ప్రారంభం కానున్న విబిజి రామ్ జి పథకం ఉపాధి హామి పథకం స్థానంలో అమలులోకి వచ్చిన దన్నారు.ఈ పథకంలో ముఖ్యంగా ప్రతీ కుటుంబానికి 125 రోజులు పని, రోజుకు 312 రూపాయలు వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు. 15 రోజులలో పని చేసిన శ్రామికులకు వేతన చెల్లింపులు జరుగుతాయని, చెల్లింపులు ఆలస్యం అయితే ఆలస్యపు పరిహారం కూడా 0.05% శాతం శ్రామికులకు అందుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులకు అత్యంత ప్రాధాన్యత వుంటుందన్నారు. భూగర్భ జలాలు పెంచడానికి అధిక ప్రాధాన్యత వుంటుందని, వ్యవసాయ పనులు జరిగే కాలంలో రైతులకు కూలీలకు ఇబ్బంది కలుగకుండా 60 రోజులు పాటు ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరుగుతుందన్నారు.అలాగే రైతులకు శాస్విత ఆస్తుల కల్పనకు తద్వారా రైతుల ఆర్థికాభివృద్ధికి దోహదపడే పనులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో అంజనప్ప డిప్యూటీ ఎంపీడీఓ ఎంవి ప్రసాద్,మారుతి,ఏవో థామస్ రాజా,నాయకులు పురుషోత్తం, మధు, వెంకటరమణ, టీ.ఏ. లు, ఎఫ్ ఏ , ఉపాధి శ్రామికులు పాల్గొన్నారు

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :