Sunday, 26 July 2026 07:40:26 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు

Date : 03 December 2025 04:29 PM Views : 180

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : అంబరాన్ని అంటిన టౌన్ బ్యాంక్ శతాబ్ది సంబరాలు... ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐదు మంది ఎమ్మెల్యేలు... మదనపల్లి టౌన్ బ్యాంక్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుతున్న సందర్భంగా టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ ఆధ్వర్యంలో నిర్వహించిన శతాబ్ది ఉత్సవాలు స్థానిక ఎన్విఆర్ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు... ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ భాష, పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్, చంద్రగిరి శాసనసభ్యులు పులివర్తి నాని, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు... స్థానిక చిత్తూరు బస్టాండ్ కూడాల్లి నుండి పెద్ద ఎత్తున మేల తాళాలు, బాణాసంచా పేలుస్తూ ఘన స్వాగతం పలికారు... ఎన్విఆర్ కళ్యాణమండపంలో రాష్ట్ర నలుమూలల నుండి తరలి వచ్చిన కోపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్లు, పట్టణ ప్రముఖులు, ముఖ్య అతిథులు సభలో ప్రసంగించారు.. వందేళ్లు ఒక మునుపు 30 మంది సభ్యులు 400 రూపాయలతో ప్రారంభించిన మదనపల్లి టౌన్ బ్యాంక్ నేడు 125 కోట్ల డిపాసిట్లు, 100 కోట్లకు పైగా రుణాలు అందించి రాష్ట్రంలోని గుర్తింపు కలిగిన బ్యాంకుగా పేరు సంపాదించుతుందని అన్నారు.. మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ భాష మాట్లాడుతూ మదనపల్లె ను జిల్లాగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కు ధన్యవాదాలు తెలియజేశారు.. రానున్న కాలంలో మరిన్ని బ్రాంచీలు ప్రారంభించి టౌన్ బ్యాంకు మరింత విస్తృతంగా ప్రజలకు సేవలు అందించాలని కోరారు... ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ సీఈవో ప్రసాద్, పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు బ్యాంకు ఖాతాదారులు పాల్గొన్నారు...

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: