నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 07 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో పారిశుద్ధ్యం లోపించడంపై స్పందించిన ఎంపీడీవో ఉషారాణి మంగళవారం పురవీధుల్లో కలియ తిరిగి హల్చల్ చేశారు. మసీదు వీధి, బస్టాండ్ వీధి, మెయిన్ బజార్, విశ్వనాధ వీధి, దేవళం వీధుల్లో మురికి నీటి కాలువలు శుభ్రం తో పాటు చెత్త చెదారం దగ్గరుండి శుభ్రం చేయించి పారిశుధ్యం లోపిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు. ఎన్నడూ లేని విధంగా ఎంపీడీవో వీధిలో పర్యటించడంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ విధిగా పారిశుద్ధ్యం తోపాటు కాలువలపై మూతలు వేయాలని ఫిర్యాదు చేశారు.ఆమె వెంట ఏవో థామస్ రాజా, డిప్యూటీ ఎంపీడీవో ఎంవీ ప్రసాద్ కార్యదర్శి శ్రీనివాసరావు, టిడిపి తెలుగు యువత నాయకుడు నరసింహులు, మాదారపు రాజశేఖర్, ఐసుల కృష్ణ, పంచాయతీ సిబ్బంది పద్మావతి, భాస్కర్, మస్తాన్, మనోహర తదితరులు పాల్గొన్నారు
Reporter
Namitha News