నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : పికేయం - ఉడా సెక్రటరీని సన్మానించిన రాయల్ గణి . (పలమనేరు,కుప్పం,మదనపల్లి,తంబళ్లపల్లి) అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పికేయం - ఉడా సెక్రటరీగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పి.ఆర్.మనోహర్ ని ఉమ్మడి చిత్తూరు జిల్లాల జనసేన నాయకుడు రాయల్ గణి గురువారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు.ఈ సందర్భంగా రాయల్ గణి మాట్లాడుతూ పి.ఆర్.మనోహర్ ఎంతో సమర్థవంతమైన అధికారి అన్నారు.గతంలో బి.కొత్తకోట మున్సిపల్ కమిషనరుగా,మదనపల్లి మున్సిపల్ మేనేజరుగా సమర్ధవంతంగా విధులు నిర్వహించారని కొనియాడారు.దీంతో ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించి పికేయం - ఉడా సెక్రటరీగా బాధ్యతలు అప్పగించిందన్నారు.ఆయన పికెఎం - ఉడాను మనోహర్ అభివృద్ధికి బాటలు వేస్తారని ధీమా వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చక్రి,వెంకటేశ్వర తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News