నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 29 : తంబళ్లపల్లె మండల కేంద్రానికి సమీపంలోని మల్లయ్య కొండ మహాశివుని దర్శనానికి సోమవారం భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి భక్తులు ఆర్టీసీ బస్సులతో పాటు ప్రైవేట్ వాహనాలు, కాలినడకన కొండకు చేరుకొని శివాలయంలో స్వామికి అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వాములు ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు, ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అదేవిధంగా వెలుగు మల్లమ్మ, గౌరీ మాత ఆలయం, వీరన్నగెవి, భాగీరథి, ఎలకతీర్థం లలో భక్తులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. భక్తులకు ఈవో మునిరాజా, రికార్డు అసిస్టెంట్ కొండ కిట్ట ల ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.
Reporter
Namitha News