Sunday, 26 July 2026 12:26:47 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు

విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు

Date : 28 February 2026 06:49 PM Views : 203

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కృత్రిమ మేధస్సుతో శాస్త్ర విజ్ఞానానికి కొత్త దిశలు – విశ్వం ఇంజినీరింగ్ కళాశాలలో జాతీయ సైన్స్ డే–2026 వేడుకలు విశ్వం ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లెలో జాతీయ సైన్స్ డే–2026ను ఫిబ్రవరి 28, 2026న ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కళాశాల BS&H విభాగం ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డా. ఎన్. రాజా గోపాల్ రెడ్డి, డా. కె. కృష్ణవేణి, డా. జి. రమేష్ సమన్వయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమానికి కన్వీనర్ మరియు BS&H విభాగాధిపతి డా. చ. కల్యాణి నేతృత్వం వహించగా, BS&H విభాగంలోని సమస్త అధ్యాపకులు సహకారం అందించారు. ఈ సందర్భంగా మొదటి సంవత్సరం బీ.టెక్ విద్యార్థుల కోసం “గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రాలలో కృత్రిమ మేధస్సు (AI) అనువర్తనలు” అనే అంశంపై పేపర్ ప్రెజెంటేషన్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ సృజనాత్మక ఆలోచనలు, పరిశోధనా దృష్టికోణంతో ఆకట్టుకునే ప్రదర్శనలు ఇచ్చారు. ఈ పోటీలలో భౌతిక శాస్త్రం విభాగంలో బి. హేమంత్ (AIML) విజేతగా నిలిచారు. రసాయన శాస్త్రం విభాగంలో లిఖిత (AIDS) ప్రథమ బహుమతి సాధించారు. ఆత్మీయ బహుమతిను ఘ్నేయ (AIML) అందుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో శాస్త్ర విజ్ఞానం పట్ల ఆసక్తి పెంపొందించడంతో పాటు, ఆధునిక సాంకేతికతలైన AI వినియోగంపై అవగాహన కల్పించినట్లు కళాశాల ప్రిన్సిపల్ మరియు యాజమాన్యం పేర్కొంది. ఇలాంటి కార్యక్రమాలు ద్వారా విద్యార్థులు తమ నైపుణ్యాన్ని పెంపొందించుకొనవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమనందు వైస్ ప్రిన్సిపాల్ టీఎస్ గౌస్ బాషా మొదటి సంవత్సరం అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :