నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - డిసెంబర్ 03 ః తంబళ్లపల్లె మండల కేంద్రం సమీపం లోని మల్లయ్య కొండ ఆదాయ వనరుల వేలం పాట లను ఈనెల 6వ తేదీన కొండపైన దేవస్థానం వద్ద నిర్వహించనున్నట్లు కార్యనిర్వాహణ అధికారి ఎద్దుల మునిరాజా తెలిపారు. మల్లయ్య కొండ మల్లికార్జున స్వామి దేవస్థానం కు చెందిన ఆదాయ వనరులు 1.2.2026 నుండి 31.1.2027 ఏడాది కాలం వరకు తలనీలాలు పోగు చేసుకునే హక్కుకు రూ లక్ష డిపాజిట్, వాహనములు పార్కింగ్ హక్కుకు రూ లక్ష డిపాజిట్, గౌరమ్మ గుడి వద్ద పూజ సామాగ్రి సేకరణ కు రూ50వేలు, వెలుగు మల్లమ్మ గుడి వద్ద పూజా సామాగ్రి అమ్ముకునేందుకు రూ 50వేలు, వీరన్న గెవిల వద్ద పూజా సామాగ్రి అమ్ముకునే హక్కుకు రూ 10వేలు, కొండపై పూజా సామాగ్రి, అంగడి నిర్వహణకు రూ 50వేలు, కొబ్బరి చిప్పలు సేకరణ కు రూ 50వేలు, దేవస్థానం వద్ద పాదరక్షలు భద్రపరిచే రుసుము వసూలు చేసుకునేందుకు 14.2.2026 నుండి 16.2.2026 తేదీ వరకు వేలంపాటకు రూ 10వేలు డిపాజిట్ చెల్లించాలన్నారు. వేలం పాట దక్కించుకున్న వారు వెంటనే సగభాగం చెల్లించి రశీదు పొంది మిగిలిన పైకం ను 20 రోజుల లోపు చెల్లించి రసీదు పొందాలని గతంలో దేవస్థానానికి బకాయిలు ఉన్న వారు వేలం పాటలకు అనర్హులని తెలిపారు . ఆసక్తి గల పాటదారులు వేలం పాటలలో పాల్గొనాలని ఈ.ఓ. మునిరాజా తెలియచేసారు.
Reporter
Namitha News