Sunday, 26 July 2026 08:00:42 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

ప్రశాంతం గా మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్

Date : 03 May 2026 07:38 PM Views : 138

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మే 03 : మదనపల్లి పట్టణం సమీపం అంగళ్ళు లో నున్న మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ డీమ్డ్ యూనివర్సిటీ 2026-27 విద్యాసంవత్సరం ప్రవేశం కొరకు ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ పరీక్షను ఘనంగా నిర్వహించామని యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ ఆన్లైన్ పరీక్షకు సుమారు 2000 మంది విద్యార్థులు 9 కేంద్రాలలో హాజరై పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. మదనపల్లె, కడప, కర్నూల్, నంద్యాల, అనంతపూర్, చిత్తూర్, తిరుపతి, హిందూపూర్ మరియు విజయవాడ కేంద్రాలలో ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత సాధించిన విద్యార్థులకు యూనివర్సిటీ లోని వివిధ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా, చాకచక్యంగా పరీక్షలో పాల్గొన్నారని ఆయన అభినందించారు. ఈ పరీక్షను ఉదయం మరియు మధ్యాహ్నం రెండు సెషన్లలో, ప్రతి సెషన్ రెండు గంటల పాటు నిర్వహించినట్లు తెలిపారు. పరీక్షా నిర్వహణలో సాంకేతిక మరియు పరిపాలనా సిబ్బంది సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించగలిగామని తెలిపారు. పరీక్ష ఫలితాలను త్వరలోనే విడుదల చేయనున్నట్లు ఉపకులపతి పేర్కొన్నారు. అలాగే ప్రవేశ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రో ఛాన్సుల్లేర్ ద్వారకానాథ్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ప్రిన్సిపాల్ డాక్టర్ రామనాథం, డీన్లు, విభాగాధిపతులు, అధ్యాపకులు మరియు సిబ్బంది పాల్గొని పరీక్ష నిర్వహణ లో పాల్గొన్నారు

DONTHI RAJASHEKAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :