నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 08 : రామసముద్రం మండలంలోని దిన్నిపల్లె సమీపంలోని కొండఫై వెలిసిన గవితిమ్మరాయ స్వామి ఆలయం లో ఆలయ ప్రధాన అర్చకులు కులశేఖర్ బట్టర్ ఆధ్వర్యంలో అనిల్ స్వామి స్వామివారికి ఉదయం ఆలయ శుద్ధిచేసి పలు రకాల పుష్పములతో అలంకరణ చేసి అర్చనలు అభిషేకలు నిర్వహించి భక్తులకు దర్శన బాగ్యం కల్పించి వారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు.భక్తులు గోవిందా గోవిందా అంటూ నామస్మరణలతో మారి మ్రోగిన గెవితిమ్మరాయస్వామి ఆలయం.అలాగే మండల కేంద్రంలోని చెంబకూరు రోడ్డులో ఉన్న శనేశ్వరస్వామి ఆలయం లో స్వామి వారికి అర్చనలు, అభిషేకాలు నిర్వహించిన పూజారి నాగార్జున భక్తులకు స్వామివారిని దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Reporter
Namitha News