నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : కురబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక వర్కింగ్ ప్రెసిడెంట్ కురబ సంఘం బెల్లే రెడ్డి ప్రసాద్ మరియు మాజీ కురబ కార్పొరేషన్ డైరెక్టర్ దండు రామానుజులు ఆధ్వర్యంలో నూతన కమిటీ ఎంపిక చేయడం జరిగింది. కృప సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ ఎంపిక మరియు కదిరి రోడ్డు నందు కురుబ కుల కనకదాస్ భవన నిర్మాణం కి కృషి చేసేందుకు కుల బాంధవులు ఏకతాటిపై నిలిచి అభివృద్ధి పథంలో నడిపించాలని తెలియజేశారు. కురుబ సంఘం మదనపల్లి నూతన డివిజన్ కమిటీ లో గౌరవ అధ్యక్షులు ఆర్కే శ్రీనివాసులు మరియు బద్దిపల్లి రామిరెడ్డి, అధ్యక్షులు కప్పల శ్రీనివాసులు, జనరల్ సెక్రెటరీ మేజారి సదాశివ, జాయింట్ సెక్రటరీ కోటకొండ రాజేష్, ట్రెజరర్ శ్రీనివాసులు, ప్రచార కార్యదర్శి బద్ది రెడ్డప్ప, అధ్యక్షులు గుడే శ్రీనివాసులు, మహిళా అధ్యక్షురాలు లలిత కుమారి, ప్రధాన కార్యదర్శి మల్లిక, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన డివిజన్ కమిటీ సభ్యులు అందరూ కురుబ కురుబ సంఘం మరియు కనకదాసు భవనం ఏర్పాటుకు మా వంతు కృషి చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో కొప్పల నరసింహులు, మనోహర్, రమేష్, రెడ్డప్ప, సిపిఐ శివ, మరియు కురబ కురమ కుల బాంధవులు పెద్ద ఎత్తున పాల్గొని సభను విజయవంతం చేశారు.
Reporter
Namitha News