నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - మే : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కాపునాడు సంఘం సారథ్యంలో అన్నమయ్య జిల్లా కాపునాడు అధ్యక్షుడిగా తంబళ్లపల్లె పెద్దేరు ప్రాజెక్టు చైర్మన్ కొటాల శివకుమార్ ను రాష్ట్ర కాపునాడు ప్రతినిధులు దివంగత రాష్ట్ర కాపునాడు అధ్యక్షుడు పిల్లా వెంకటేశ్వరరావు కుమార్తె శ్రీదేవి, మదనపల్లి కాపునాడు అడ్ హక్ కమిటీ ఉపాధ్యక్షుడు ఆంజనేయ కుమార్ లు ఎంపిక చేశారు. బుధవారం మదనపల్లెలో జరిగిన రాష్ట్ర కాపునాడు సంఘం సమావేశంలో జిల్లా అధ్యక్షుడిగా కొటాల శివకుమార్ తో పాటు మరో 67 మంది నియోజకవర్గ అధ్యక్షులు, కమిటీ నెంబర్లను ఏకగ్రీవంగాఎంపిక చేశారు. ఈ సందర్భంగా కొటాల శివకుమార్ తన ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఇచ్చిన జిల్లా కాపునాడు అధ్యక్ష పదవి కి న్యాయం చేస్తూ కాపు, బలిజ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు సంఘాల సమస్యల పరిష్కారానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని సంఘం బలోపేతానికి సాయి శక్తుల కృషి చేస్తానని హామీ ఇచ్చారు. శివకుమార్ కు జిల్లా కాపునాడు అధ్యక్ష పదవి దక్కిన విషయం తెలుసుకున్న తన జన్మస్థలం పెద్దేరు ఆయకట్టులోని కొటాల, ఆర్ ఎన్ తాండా, జుంజురపెంట పంచాయతీలలోని నాయకులు, ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకోగా తంబళ్లపల్లె మండలంలోని టిడిపి, బిజెపి, జనసేన కూటమి నాయకులు సంతోషం వ్యక్తం చేస్తూ ఫోన్లో ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసి భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు
Reporter
Namitha News