నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జూలై 07 ః తంబళ్లపల్లె మోడల్ స్కూల్ విద్యతోపాటు అన్ని రంగాలలో అభివృద్ధి వైపు దూసుకుపోతుందని ఇందులో పీఎం శ్రీ తో రెట్టింపు అభివృద్ధి సాధించడం ఖాయమని ఏఎం ఓటి నాదిర్ష కొనియాడారు. మంగళవారం ఆయన మోడల్ స్కూల్స్ సందర్శించి పాఠశాలలో 21 అంశాల పై పర్యవేక్షించారు. ఇందులో ప్రధానంగా ఆటలు, అన్ని రకాల ల్యాబ్ లు, స్కూల్ గ్రౌండ్, ఆర్వో ప్లాంట్, ఎండిఎం, ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్, బయాలజీ ల్యాబ్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోడల్ స్కూల్ భవిష్యత్తులో అన్ని రంగాలలో ముందుకు రావాలని ఆకాంక్షించారు. ఆయన వెంట ఎంఈఓ నాగ సుబ్బరాయుడు, ప్రిన్సిపల్ హేమంత్ కుమార్, మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు
Reporter
Namitha News