నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఫిబ్రవరి 15 : తంబళ్లపల్లె మల్లయ్య కొండ మహాశివుని రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ తంబళ్లపల్లె అబ్జర్వర్ దినేష్ రెడ్డి ఆదివారం సాయంత్రం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనను ఈవో మునిరాజా సాదరంగా ఆహ్వానించి అర్చకులు ఈశ్వరప్ప, మల్లికార్జున స్వామి లు ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. అయన మల్లయ్య కొండ శివరాత్రి ఉత్సవ నిర్వహణపై ఈఓను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్తులో మల్లయ్య కొండ అభివృద్ధికి కుటుంబ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఆయన వెంట రాష్ట్ర టిడిపి బీసీ ఉపాధ్యక్షుడు తులసీధర్ నాయుడు, రాజంపేట తెలుగు యువత ఉపాధ్యక్షుడు డేరంగుల చంద్ర, టిడిపి జిల్లా బీసీ నాయకుడు సురేంద్ర, సోమశేఖర్, మీసాల భాస్కర్ నాయుడు, టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
Namitha News