Monday, 27 July 2026 04:21:27 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

భావోద్వేగాల నడుమ ముగ్గురు ఏఎస్ఐల పదవీ విరమణ

వీరి జీవిత భాగస్వాముల త్యాగం వెలకట్టలేనిదన్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి

Date : 30 May 2026 06:34 PM Views : 88

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లి - మే 30: సమాజ రక్షణ కోసం దశాబ్దాల కాలం పాటు అంకితభావంతో పనిచేసి, ప్రజలకు సేవలందించిన పోలీసు అధికారుల సేవలు చిరస్మరణీయమని అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి కొనియాడారు. శనివారం స్థానిక పోలీసు సమావేశ మందిరంలో మే నెలలో పదవీ విరమణ పొందిన ముగ్గురు ఏఎస్ఐలకు జిల్లా పోలీసు యంత్రాంగం తరపున ‘ఆత్మీయ వీడ్కోలు’ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, ఒక పోలీసు అధికారి సుదీర్ఘ సర్వీసు పూర్తి చేయడంలో వారి జీవిత భాగస్వామి పాత్ర, భాగస్వామ్యం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. నాటి రోజుల్లో నేటి వలె అత్యాధునిక వసతులు లేకపోయినా, రకరకాల ఇబ్బందులను తట్టుకుని, కుటుంబానికి దూరంగా ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించడంలో సతీమణులు అందించిన సహకారం, చేసిన త్యాగాలు వెలకట్టలేనివని వారిని ప్రత్యేకంగా అభినందించారు. ఇన్ని రోజులు విధి నిర్వహణకే అంకితమై సమయాన్ని, శక్తిని వినియోగించారని, ఇకపై శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి పూర్తి సంతోషంతో, ఆరోగ్యంగా గడపాలని ఆకాంక్షించారు

పదవీ విరమణ పొందిన వారిలో కలికిరి పీఎస్ ఏఎస్ఐ ఎస్. మాబూ సాహెబ్ (35 ఏళ్ల సర్వీస్), రామాపురం పీఎస్ ఏఎస్ఐ పి. వెంకటరమణ (35 ఏళ్ల సర్వీస్), మరియు రైల్వేకోడూరు పీఎస్ ఏఎస్ఐ ఎం. శేఖర్ రావు (33 ఏళ్ల సర్వీస్) ఉన్నారు. వీరికి ఎస్పీ గారు జ్ఞాపికలను అందజేసి, శాలువాలతో ఘనంగా సత్కరించారు. దశాబ్దాలుగా మమేకమైన పోలీసు శాఖను, తోటి సిబ్బందిని వదిలి వెళ్తుండటంతో అటు సంతోషం, ఇటు దుఃఖం కలగలిసిన భావోద్వేగాల నడుమ రిటైర్డ్ అధికారులు కన్నీరు కార్చారు. తమను ఇంత గౌరవంగా సత్కరించడం జీవితంలో మరువలేమంటూ ఎస్పీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పోలీసు శాఖ ఎప్పుడూ ఒకే కుటుంబమని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సమస్య వచ్చినా సంప్రదించవచ్చని ఎస్పీ గారు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) శ్రీ ఎం. వెంకటాద్రి గారు, ఏఏఓ పి. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు ఎం. రవికుమార్, కె. సురేష్ కుమార్ రెడ్డి, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది మరియు పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :