Sunday, 26 July 2026 03:50:46 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

22ఏ భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

22 ఎకరాల 62 సెంట్ల భూములకు నేడు కలెక్టరేట్లో బాధితులకు యన్.ఓ.సి.ల జారీ

Date : 26 December 2025 10:30 PM Views : 206

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రాయచోటి - డిసెంబర్ 26 : ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ శుక్రవారం నాడు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించారు. పలు కారణాల వల్ల 22ఏ మరియు చుక్కల భూములకు సంబంధించిన యన్.ఓ.సీ లు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయన్న విషయం విధితమే. ఈ భూముల పరిష్కారానికి శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించి జిల్లా యంత్రాంగానికి తగిన ఆదేశాలు జారీ చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా నేడు 22 ఎకరాల 62 సెంట్ల భూములకు సంబంధించిన బాధితులకు యన్.ఓ.సి. లను నేడు జారీ చేశామన్నారు. మదనపల్లి మండలానికి చెందిన శ్రీలత, భాస్కర్, కానాల చెంగమ్మ, హేమలత, నందకిషోర్,మరియు కురబలకోట మండలానికి చెందిన మస్తాన్ రెడ్డి లకు ఈ సందర్భంగా ఎన్ఓసీ లను జారీ చేశామని పేర్కొన్నారు. ఈరోజు మరో 15 ఎకరాల 28 సెంట్ల 22 ఏ భూములకు సంబంధించిన 10 కేసులను విచారణ చేపట్టామని వీటికి సంబంధించిన యన్.ఓ.సీ లను సోమవారం నాడు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలో పెండింగ్ లో నున్న 22ఏ మరియు చుక్కల భూముల సమస్యలపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుందని త్వరలో ఈ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని, రికార్డుల ఫోర్జరీ కేసులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపిన జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్. యన్.ఓ.సీ లను పొందిన లబ్ధిదారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ లో నున్న తమ 22ఏ భూముల సమస్యలు పరిష్కరించిన రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, జిల్లా కలెక్టర్ కు, జిల్లా పాలన యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు

Sri Hari B

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :