నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 21 : రామసముద్రం మండలం దిగువపాళ్యం కు చెందిన దలిత నాయకుడు భాస్కర్ పై దర్శన్ గౌడు చేసిన దాడిపై పోలీసులు తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని పోలీసు స్టేషన్ లో మాలమహనాడు రాష్ట్ర నాయకులు డాక్టర్ యమల సుదర్శన్ పోలీస్ లకు డిమాండ్ చేసి పోలీస్ స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు . శుక్రవారం పోలీస్ స్టేషన్ లో మాల మహా నాడు నాయకులు యమల సుదర్శన్,రవి మల్లెల మెహనగూండా మనోహర్ చంద్రయ్య మరియు రామసముద్రం మండల దలిత మాలమహనాడు నాయకులు భాస్కర్ ,శేషాద్రి, నరసింహులు, పవన్, శ్రీరాములు, మల్లికార్జున, అంబరీష్, శంకరన్న, సోమశేఖర్, మెకానిక్ వెంకటేష్, గంగాదర్, సురేష్, బాబూరావ్, వెంకటరమణ, రమణప్ప, చంద్ర, అరికెల చంద్ర, హరి, జై భీమ్ గంగాధర్, శ్రీకాంత్, ఆంజనేయులు, జే సి బి రామాంజులు, తదితరులు పాల్గొని మాలహనాడు నాయకులు భాస్కర్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండీంచారు. దీనిపై రామసముద్రం పోలీస్ స్టేషన్ లో నిందితునిపై యస్సీ, యస్.టి కేసు నమోదు చేయమని పిర్యాదు చేయడం జరిగింది. ఎస్సై రమేష్ బాబు గత మూడురోజులుగా అందుబాటులో లేనందువలన చరవాణి ద్వారా సంభాషించి కేసు నమోదు చేస్తామని హమీ ఇవ్వడం జరిగింది
Reporter
Namitha News