నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - జనవరి 27 : ఆత్మకూరు డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కార్యకర్తలు తమ న్యాయమైన డిమాండ్లు పలుమార్లు విన్నవించినా ప్రభుత్వం స్పందించలేదని, ఫిబ్రవరి 12వ తేదీ నుండీ సమ్మె చేస్తామంటూ వినతిపత్రం సమర్పించిన అంగన్వాడీ కార్యకర్తలు, వీరికి మద్దతు తెలిపిన ఆత్మకూరు డివిజన్ సిఐటియు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య. వచ్చే నెల 12 వ తేదీన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఆత్మకూరు అంగన్వాడీ కార్యకర్తలు నేడు కార్యాలయ అధికారిని సిడిపిఓ సునీలత కు సమ్మె నోటీసు అందించారు. సిఐటియు ఆత్మకూరు మండల అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య ఆధ్వర్యంలో ఆత్మకూరు ప్రాంత అంగన్వాడి కార్యకర్తల యూనియన్ కార్యదర్శి పి.రాధ, అధ్యక్షులు కే.రవణమ్మ, సెక్టర్ లీడర్లు కుసుమ, లావణ్య, మీనాక్షి, మస్తానమ్మ తదితరులు ఈ నోటీసు అందించిన వారిలో ఉన్నారు.. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశాన్ని సీఐటీయూ అధ్యక్షులు ఆత్మకూరు నాగయ్య, మరియు అంగన్వాడి కార్యకర్తల కార్యదర్శి రాధా మాట్లాడుతూ తమ సమస్యల సాధన కోసం ఫిబ్రవరి 12 వ తేదీన తాము సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు..లేబర్ కోడ్స్ ను రద్దు పరచలని, తమ కనీస వేతనాన్ని 26 వేలకు పెంచాలని, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని మరికొన్ని సమస్యలపై తాము సమ్మె చేపడుతున్నట్లు వారు తెలిపారు
Reporter
Namitha News