Sunday, 26 July 2026 06:29:48 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి

Date : 05 June 2026 05:42 PM Views : 227

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : యోగాంధ్ర–2026 కార్యక్రమాలను విజయవంతం చేయాలి జూన్ 7 నుంచి 21 వరకు విస్తృత యోగా కార్యక్రమాలు... జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 7 నుంచి 21 వరకు నిర్వహించనున్న యోగాంధ్ర–2026 కార్యక్రమాలను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లి కలెక్టరేట్‌లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో యోగాంధ్ర–2026 కార్యక్రమాల నిర్వహణపై మదనపల్లి సబ్ కలెక్టర్, ఆర్డీవో, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆయుష్ శాఖ అధికారులు, డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్, డీఆర్‌డీఏ, డ్వామా, జిల్లా పర్యాటక శాఖ, ఐసీడీఎస్, జిల్లా విద్యాశాఖ, సర్వశిక్షా అభియాన్, జిల్లా క్రీడాశాఖ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు సమగ్ర మార్గమని తెలిపారు. యోగా ద్వారా శరీరానికి బలం, సమతుల్యత పెరగడంతో పాటు మనస్సు ప్రశాంతంగా మారి ఒత్తిడి తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026 నిర్వహణలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలు, పౌరుల నమోదు, యోగా ప్రదర్శనలు, యోగా పోటీలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం వంటి ఐదు ప్రధాన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. జూన్ 6, 7 తేదీల్లో మాస్టర్ ట్రైనర్లకు శిక్షణలు నిర్వహించడంతో పాటు జూన్ 8 నుంచి 12 వరకు యోగా శిక్షకులకు శిక్షణలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం జూన్ 9 నుంచి 17 వరకు శిక్షకుల ద్వారా పౌరులకు యోగా శిక్షణలు నిర్వహిస్తారని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా విస్తృత స్థాయిలో పౌరుల నమోదు చేపట్టి యోగా కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పించనున్నట్లు వివరించారు. జూన్ 7 నుంచి 20 వరకు థీమాటిక్ యోగా, టూరిస్ట్ యోగా, టెంపుల్ యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మున్సిపల్ ప్రాంతాల్లో ప్రత్యేక యోగా రోడ్లను గుర్తించి కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. యోగాపై అవగాహన పెంపొందించేందుకు గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఆసనాలు, ప్రాణాయామం, సింక్రొనైజ్డ్ యోగా, క్విజ్, నినాదం, వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి పోటీలు జూన్ 7 నుంచి 9 వరకు, మండల స్థాయిలో జూన్ 10 నుంచి 12 వరకు, జిల్లా స్థాయిలో జూన్ 14 నుంచి 16 వరకు, రాష్ట్ర స్థాయిలో జూన్ 18 నుంచి 20 వరకు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న అమరావతి వెస్ట్ బైపాస్ వద్ద 25 వేల మంది పాల్గొనే రాష్ట్రస్థాయి ప్రధాన కార్యక్రమంతో పాటు ప్రతి జిల్లా కేంద్రంలో వెయ్యి మంది పౌరులతో జిల్లా స్థాయి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో కూడా భారీ ఎత్తున ప్రజల భాగస్వామ్యంతో యోగా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. జిల్లా స్థాయిలో ప్రతి కోర్‌కు జిల్లా నోడల్ అధికారులను, మండల స్థాయిలో నోడల్ అధికారులను నియమించి కార్యక్రమాల నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి యోగాంధ్ర–2026ను విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో డీఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: