నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : మదనపల్లె - మార్చి 14 : అంగళ్ళు సమీపంలో గల మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ లోని మేనేజ్మెంట్ స్టడీస్ విభాగం నందు అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ ఎస్ కు కడప లోని యోగి వేమన యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ పట్టాను పొందినట్లు యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి. యువరాజ్ తెలిపారు. భారతదేశంలోని కొన్ని ఐటీ కంపెనీలలో ఉద్యోగులు పొందే అనుభవం వారి పనితీరుపై ఎలా ప్రభావం చూపుతుందో పరిశీలించడం అను అంశంపై యోగి వేమన యూనివర్సిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం నందు పనిచేస్తున్న ప్రొఫెసర్ వై.సుబ్బారాయుడు ఆధ్వర్యంలో చేసిన పరిశోధనలకుగాను డాక్టరేట్ ను ప్రదానం చేసినట్లుగా తెలిపారు. ఇస్మాయిల్ ఎస్ ను మిట్స్ యూనివర్సిటీ ఫౌండర్ & ఛాన్సల్లర్ డాక్టర్ యెన్. విజయ భాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సల్లర్ యెన్.ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెళ్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ పి.రామనాథన్, డీన్-స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ డాక్టర్ భాను శ్రీ రెడ్డి మరియు అధ్యాపకులు అభినందనలు తెలియజేశారు
Reporter
Namitha News