నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : విశ్వం ఇంజనీరింగ్ కళాశాలలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగల్లు సమీపంలోని విశ్వం ఇంజనీరింగ్ కళాశాల లో 77 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించినట్టు కళాశాల ప్రిన్సిపల్ డా. డి. రమణా రెడ్డి తెలిపారు, ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు, తరువాత ఆయన మాట్లాడుతూ భారతదేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని, సమాజ సేవకు కట్టుబడి ఉండాలని విద్యార్థులను ప్రోత్సహించారు. ఆయన దేశభక్తి మరియు జాతీయత కంటే ఎక్కువగా దేశాన్ని దృఢంగా పునరుత్థానించడానికి విద్య, సాంకేతికత, మరియు ఆత్మనిర్భరత వంటి అంశాలపై కూడా స్పష్టమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు, ఈ సందర్బంగా బయట వివిధ కళాశాల లో నిర్వహించి న వివిధ పోటీలలో విజయం సాధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ మరియు జ్ఞాపిక తో సత్కరించారు, ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్ డా. డి. రమణా రెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ టీఎస్ గౌస్ బాషా, డీన్స్, హెచ్వోడీస్, అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు
Reporter
Namitha News