నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 03 :తంబళ్లపల్లె మండలంలోని బి ఎల్ వో లు ఓటర్ల జాబితా నిష్పక్షపాతంగా త్వ⁰రగా పూర్తి చేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. శనివారం కార్యాలయంలో బిఎల్వోలతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల జాబితా నూతన ఓటర్లు ఎంపిక, చనిపోయిన వారి పేర్లు తొలగింపులో క్షేత్రస్థాయిలో ఇంటింటికి తిరిగి నికాసైన ఓటర్ల జాబితా తయారీకి సహకరించాలని సూచించారు. ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఓటర్ల నమోదు కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా తమ దృష్టికి తేవాలని లోటుపాట్లు లేకుండా సర్వే నిర్వహణ చేపట్టాలని కోరారు. ఓటర్ల నమోదు పై కంప్యూటర్ ఆపరేటర్ కిషోర్ వి ఎల్ వో లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఐ ముద్దుకృష్ణ, మండలంలోని బిఎల్వోలు పాల్గొన్నారు.
Reporter
Namitha News