Sunday, 26 July 2026 12:27:16 AM
# మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు # మిట్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ నవీన్ కు డాక్టరేట్ # త్రాగునీటి సమస్యను తీర్చిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు

13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు

Date : 11 November 2025 09:58 AM Views : 236

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : 13న జరిగే ఏఎంసి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవాని తరలిరండి - డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపు మదనపల్లె : ఈనెల 13వ తేదీ అనగా గురువారం జరిగే మదనపల్లి వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి బిజెపి,జనసేన,టిడిపి నాయకులు తరలిరావాలని డైరెక్టర్ బర్నేపల్లి సంధ్యారాణి రవికుమార్ పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా సోమవారం ఆమె మాట్లాడుతూ నీరుగట్టువారి పల్లిలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో అట్టహాసంగా జరిగే ఈ ప్రమాణ స్వీకారోత్సవానిక మంత్రులు సత్యకుమార్ యాదవ్,నాదెండ్ల మనోహర్,మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిలతో కూటమి పార్టీలకి చెందిన ప్రముఖులు హాజరవుతున్నట్లు తెలిపారు.రాష్ట్ర అభివృద్ధి,ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు.ఏపి అభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోడీ సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు.ప్రజల రాజధాని అమరావతి,ఏపీ జీవనాడి పోలవరం పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తోందని కొనియాడారు.అదేవిధంగా మదనపల్లె జిల్లా ఏర్పాటుకి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలపడంతో ఇక్కడ ప్రజల ఆకాంక్ష నెరవేరబోతోందని హర్షం వ్యక్తం చేశారు.తనను మార్కెట్ కమిటీ డైరెక్టరుగా నియమించినందుకు బిజెపి అధిష్టానానికి,కూటమి నాయకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు.మార్కెట్ కమిటీ అభివృద్ధి కోసం,టమోటా రైతుల శ్రేయస్సు కోసం శక్తివంచన లేకుండా పనిచేస్తానని ఆమె స్పష్టం చేశారు.

B.MANI KUMAR

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :