నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : రామసముద్రం - నవంబర్ 18 : నమితన్యూస్. టిడిపి నాయకులకు,కార్యకర్తలకు అన్నివిధాలా అండగా ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మదనపల్లె నియోజక వర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ పేర్కొన్నారు.మండలంలోని బలిజపల్లెకు చెందిన టిడిపి నేత,రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ కోశాధికారి సీతప్ప తండ్రి వెంకటరమణ పై బుదవారం రాత్రి కొందరు దాడి చేసి తీవ్రంగా గాయపరిచి,పశువుల పాకను కూల్చివేశారు. ఈ విషయమై గురువారం మండలానికి విచ్చేసిన రమేష్ వెంకటరమణ పై దాడిచేసిన వారిపై కేసు నమోదుచేసి,నిందితులను వెంటనే అరెస్టు చేయాలని ఎస్సై ను కోరారు.అనంతరం బలిజపల్లె కు వెళ్లి దుండగులు కూల్చివేసిన పశువుల పాకను పరిశీలించారు. కేసు విషయమై పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని ,అధైర్య పడవద్దని రమేష్ సీతప్ప కు హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గౌడ్,మాజీ అధ్యక్షుడు కొండూరు నారాయణరెడ్డి ,పుంగనూరు టిడిపి నాయకులు సుబ్రహ్మణ్యం రాజు మాజీ సర్పంచ్ రెడ్డి శేఖర్ , ప్రశాంత్ రెడ్డి,శ్రీనాథ్ రెడ్డి చెంగారెడ్డి,బండ్ల జనార్దన, జావిద్, చిన్నూ స్వామి, ఏ పి మోడల్ స్కూల్ చైర్మన్ బాలాజీ,మొహమ్మద్,వేణుగోపాల్, ఎల్ శివ, జై కుమార్, శ్రీకాంత్,అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
Namitha News