నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 : తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో భవిష్యత్తులో అంతరాయాలు లేని నిరంతర విద్యుత్ సరఫరా కు చర్యలు చేపట్టినట్లు ట్రాన్స్ కో డి.ఈ గంగాధరం తెలిపారు. సోమవారం ఆయన తంబళ్లపల్లె 33/11 కె వి ఏ విద్యుత్ సబ్ స్టేషన్ లో 5 ఎంవిఏ అదనపు ట్రాన్స్ఫార్మర్, ఎల్.వి బ్రేకర్ ను పూజలు చేసి లాంఛనంగా ప్రారంభించారు. తంబళ్లపల్లె మండలం లోని రైతులు, వినియోగదారులకు నిరంతర మెరుగైన విద్యుత్ అందించడమే లక్ష్యమన్నారు. విద్యుత్ సిబ్బంది విద్యుత్ సేవలందించడంలో ముందుండాలని బిల్లుల వసూళ్లపై శ్రద్ధ చూపాలని హెచ్చరించారు. ఆయన వెంట ఏడిఈ లు గోవింద్ రెడ్డి, ఆదినారాయణ, ఏఈ సురేంద్ర, సబ్ ఇంజనీర్ శేషు, లైన్ ఇన్స్పెక్టర్లు భాస్కర్, నాగరాజు లైన్మెన్ లు శంకర, రమణ, అప్పి రెడ్డి విద్యుత్ సిబ్బంది పాల్గొన్నారు.
Reporter
Namitha News