Sunday, 26 July 2026 01:13:23 PM
# అన్నమయ్య జిల్లా ను వెంటనే కరవు జిల్లాగా ప్రకటించాలి – సిపిఐ # విజయవంతంగా వ్యవసాయ కార్మిక సంఘం సమావేశం # మల్లయ్య కొండలో వైభవంగా తొలి ఏకాదశి పూజలు # ఉపాధి హామీ లో కొబ్బరి మొక్కలు నాటుకోండి - ఎంపీడీవో ఉషారాణి # తొలి ఏకాదశి పూజ కార్యక్రమం లో పాల్గొన్న కార్ల మల్లికార్జు # ATM ను ఎత్తుకువెళ్లిన దొంగలు # ఉచిత ఎముకల శాంధ్రత పరీక్ష శిభిరం ను ప్రజలు సద్వినియోగం చేసుకోండి # విజవంతం గా మెగా పేటీఎం 4.ఓ సమావేశం.. # ప్రతి విద్యార్థిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం # కుక్కరాజుపల్లి డంపింగ్ యార్డ్ ను తనిఖీ చేసిన ఎంపిడిఓ. # పెద్దేరు ప్రాజెక్టును సందర్శించిన హైడ్రాలజీ అధికారులు. # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # ఆత్మకూరులో డాక్యుమెంట్ రైటర్స్ ఆందోళన # అక్రమంగా గ్రానైట్ రవాణా చేస్తున్న వాహనం సీజ్ # బాలికపై అత్యాచారయత్నం, యువకుడిపై పోక్సో కేసు నమోదు # ఉపాధి పనుల పై అంబుడ్స్ మెన్ అధికారి ప్రశంస # తంబళ్లపల్లె స్వర్ణ గ్రామ కార్యాలయం ప్రారంభం # వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సర్వసభ్య సమావేశాన్ని జయప్రదం చేయండి - జిల్లా కార్యదర్శి కృష్ణప్ప # మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు "తల్లికి వందనం"తో పాటు అన్ని సంక్షేమ పథకాలు వర్తింపజేయాలి # మొగసాలమర్రి వద్ద ఆర్టీసీ బస్సు–ఆటో ఢీ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

ఏపీఐఐసి కోసం 84మంది నిరుపేద రైతుల పొట్ట కొట్టదండి

జీవనాధారమైన భూములు లేకపోతే ఆత్మహత్యే గతి అంటూ మదనపల్లె సబ్ కలెక్టర్ కు ఫిర్యాదు

Date : 28 January 2026 07:51 PM Views : 369

నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - జనవరి 28 : ప్రభుత్వం తంబళ్లపల్లి మండలంలోని రెడ్డికోట, కుక్కరాజుపల్లి పంచాయతీ లలోని నాలుగు గ్రామాలకు చెందిన 84 మంది నిరుపేద ఎస్సీ, బిసి రైతుల46.527 ఎకరాల భూములను ఏపీఐఐసీ కి ధారాదత్తం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఈ విషయమై రెండు పంచాయితీల్లో ని దళితవాడ, ఈర్లవాండ్లపల్లి, పర్ల గొల్లపల్లి, రెడ్డికోటకు చెందిన నిరుపేద రైతులు గత నాలుగు మాసాలుగా జిల్లాకలెక్టర్, సబ్ కలెక్టర్, తాశీల్దార్లకు ఫిర్యాదులు చేశారు. గతవారం తంబళ్లపల్లె తాసిల్దార్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ రైతులతో సమావేశమై రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి వెళ్లారు. రైతులు జీవనాధారమైన భూములు ఇచ్చేది లేదని గట్టిగా తమ వాదనలు వినిపించారు. అయినా రెవెన్యూ అధికారులు చాప కింద నీరులా తమ పనులు తాము చేసుకుంటూ పోతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా పెద్దల సంపాదించిన భూములు పోతే మాకు ఆత్మహత్య శరణమని జిల్లా కలెక్టర్కు లిఖిత పూర్వపు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఏపీఐఐసీకి భూముల సర్వే ఓవర్గం నాయకుల సలహాతో రెవెన్యూ అధికారులు మా భూములు ల్యాండ్ యాక్యువేషన్ చట్టం ద్వారా లాక్కోవాలని చూస్తున్నారని, రెవెన్యూ అధికారులు భూ కేటాయింపు విషయమై సంబంధిత రైతులకు 26-1-2026 తేదీన పేపర్ యాడ్ వేశారు తప్ప భూసేకరణ చట్టం ప్రకారం ఎలాంటి నోటీసులు ఇవ్వ కుండా గ్రామస్థాయిలో రైతులతో విచారణ చేయకుండా భూసేకరణ పేరుతో భూములు లాక్కుంటే మేము ఎలా బతకాలని నిలదీస్తున్నారు. మా పూర్వీకుల నుండి మా భూములలో మామిడి, టెంకాయ చెట్లతో పాటు పశుగ్రాసం, వ్యవసాయ పంటలు పండించుకొని జీవిస్తున్నామని ఆ భూములు లేకపోతే మాకు ఆత్మహత్యలే శరణమని హెచ్చరిస్తున్నారు. టిడిపికి అండగా నిలబడితే మా భూములే లాక్కుంటారా! ః టిడిపి ఆవిర్భావం నుండి ఈ నాలుగు గ్రామాల బిసి, ఎస్సీ నిరుపేద రైతులు పార్టీకి అండగా నిలబడి ఓట్లు వేసి గెలిపించినందుకు మా భూములే లాక్కుంటారా అని నిరుపేద రైతులు ఆక్రోషం వ్యక్తం చేస్తున్నారు. మా భూములు ఏపీఐఐసీకి అప్పగించాలని చూస్తే మా 84 కుటుంబాలు జీవనాధారం లేక రోడ్డున పడతాయని ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాలాంటి నిరుపేద రైతుల భూముల లాక్కోవడం సమంజసం కాదని వెంటనే మా భూములను ఏపీఐఐసీకి అప్పగించే తంతును ఆపాలని లేదంటే నడిరోడ్డుపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టక తప్పదని రైతులు డిమాండ్ చేస్తున్నారు.

SREEVANI

Reporter

Namitha News

మరిన్ని వార్తలు

Copyright © Namitha News 2026. All right Reserved.



Developed By :