నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 15 ః తంబళ్లపల్లి మండలంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి పెద్దపీట వేయాలని తాసిల్దార్ శ్రీనివాసులు సూచించారు. తంబళ్లపల్లె సమీపంలోని తనకంటి వారి పల్లెలో పారిశుధ్యంలో పెంచి చెత్త చెదారం పేరుకుపోయి పందులు, దోమల సంచారం పై ఫిర్యాదు రావడంతో వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత విఆర్ఓ నాగరాజును ఆదేశించారు. ఆయన వెంటనే గ్రామంలో పారిశుధ్యం చర్యలు చేపట్టడానికి పంచాయతీ అధికారులకు సూచనలు తోపాటు గ్రామస్తులకు పారిశుధ్యం పై అవగాహన కల్పించారు
Reporter
Namitha News