నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - ఏప్రిల్ 02 : తంబళ్లపల్లి మండలంలో స్వచ్ఛ రథం ద్వారా నిర్వహిస్తున్న చెత్త సేకరణ కార్యక్రమం బాగుందని డిప్యూటీ ఎంపీడీవో పివి ప్రసాద్ కొనియాడారు. గురువారం పరసతోపు పంచాయతీలో స్వచ్ఛ రథం ద్వారా ప్రజలకు అందుబాటులో పనికిరాని ప్లాస్టిక్ వస్తువులు, ఇనుప సామాగ్రి, చెత్త వస్తువులకు బదులుగా కుటుంబానికి కావలసిన వస్తువులు కొనుగోలు చేయడం గమనించి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించి పారిశుద్ధ్యనికి పెద్దపీట వేసి స్వచ్ఛ రథం ద్వారా చెత్తను దూరం చేయడంతో పాటు ప్రజలకు ఉపయోగకరంగా ఉండి ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శు, స్వచ్ఛ రథ నిర్వాహకుడు, ప్రజలు పాల్గొన్నారు
Reporter
Namitha News