నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : ఆత్మకూరు - మే 26 : ఆత్మకూరు మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మల్లికార్జున ప్రమాదవశాత్తు చెత్త తరలించే ట్రాక్టర్ నుండి జారిపడి చనిపోయిన ఘటనలో వారి కుటుంబానికి 72 లక్షల రూపాయల ఆర్థిక సహాయం రానున్నది. చెత్త వాహనాలకు గతంలో ఎప్పుడు ఇన్సూరెన్స్ చేసిన దాఖలాలు లేవు కానీ ఈసారి ఆ వాహనాలకు ప్రస్తుత మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో ఇన్సూరెన్స్ చేయడం వల్ల వాహన ప్రమాదం ద్వారా 35 లక్షలు, మరియు ఇటీవల ప్రభుత్వ నిర్ణయంతో కార్మికుల ఖాతాలను యాక్సిస్ బ్యాంకుకు మార్చడం వల్ల ఆ బ్యాంకు నుండి 20 లక్షల రూపాయల బ్యాంక్ ఇన్సూరెన్స్ నగదు, మరియు ఇదే బ్యాంకు నుండి వారి పిల్లల చదువు కోసం ఎనిమిది లక్షల రూపాయలు మున్సిపల్ కార్యాలయం నుండి పది లక్షలు కలిపి మొత్తం 72 లక్షల నగదును త్వరలో మృతి చెందిన కార్మికుని కుటుంబానికి అందించనున్నారు. కమిషనర్ తీసుకున్న ఆ రెండు నిర్ణయాల వల్లే 60 లక్షల వరకు కార్మికుని కుటుంబానికి ఆర్థిక సహాయం లభించడం విశేషం. మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ ఆర్డిఓ బి.పావని సహకారంతో ఇప్పటికే ఐదు లక్షల నగదు చెక్కును ఇటీవల మంత్రి ద్వారా బాధిత కుటుంబానికి అందించారు
Reporter
Namitha News