నమిత న్యూస్ - Andhra Pradesh / SPSNellore : ఆత్మకూరు - నవంబర్ 07 : ఆత్మకూరు ప్రాంతంలో ఇటీవల కురిసిన తుఫాను మరియు భారీ వర్షాలకు మండలంలో అరటి తోటలు దెబ్బతిన్నాయి.. ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని వెంకట్రావుపల్లి గ్రామంలో ఆలూరు.వెంకటేశ్వర్ రెడ్డి కు చెందిన ఐదు ఎకరాల అరటి పంట పూర్తిగా దెబ్బతినిపోయింది. పంట నష్టం పై అధికారులు సంప్రదించగా వారు స్పందించకపోవడంతో ఈరోజు దెబ్బతిన్న అరటి తోటను రైతు సంఘం నాయకులు మూలివెంగయ్య, లక్కు కృష్ణ ప్రసాద్ తదితరులు పరిశీలించారు..దెబ్బతిన్న అరటి తోటను పూర్తిగా పరిశీలించి రైతుతో మాట్లాడిన అనంతరం వారు మాట్లాడుతూ అరటి పంట పండించిన రైతులు గత రెండు నెలలుగా ధరలు లేక ఒకవైపు నష్టపోతున్న సమయంలో ఈ తుఫాను తీవ్ర నష్టం చేసిందని ఈ అరటి తోట రైతు వేసిన ఐదు ఎకరాలలో పూర్తిగా చెట్లు కూలిపోయి, అరటి గెలలు కుళ్ళిపోయి రైతు పెట్టిన పెట్టుబడి 10 లక్షలు నష్టపోయారని వీరికి అండగావలసిన అధికారులే పట్టించుకోకపోవడం బాధాకరమని అప్పులు తెచ్చి పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రభుత్వం అండగా నిలవవలసిన అవసరం ఉందని ఈ సందర్భంగా రైతు సంఘం నేతలు తెలిపారు
Reporter
Namitha News