నమిత న్యూస్ - Andhra Pradesh / Annamayya : తంబళ్లపల్లె - నవంబర్ 24 : అత్యవసర సమయంలో గుండె ఆగిన వ్యక్తికి సిపిఆర్ తో ఆగిన గుండెకు ఊపిరి పోయాలని డాక్టర్ రమేష్ నాథ్ పిలుపు నిచ్చారు. సోమవారం ఐటిఐ కళాశాలలో విద్యార్థులకు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో సి పి ఆర్ ఫై అవగాహన కల్పించారు. లింగుట్ల రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ రత్న శేఖర్ విద్యార్థులకు సిపిఆర్ పై ప్రధమ చికిత్స మనిషి రూపంతో ప్రాక్టికల్ గా సిపిఆర్ చేసి క్షుణ్ణంగా వివరించారు. గుండె ఆగిన సమయంలో సిపిఆర్ చేయడం వలన ప్రాణాలు నిలబెట్టే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ సి పి ఆర్ పై అవగాహన కలిగి ఉండాలన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎంతోమంది సిపిఆర్ పై అవగాహన లేక ప్రాణాలు కోల్పోయారని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సిపిఆర్ అవగాహన కార్యక్రమాలు విస్తృతం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఐటిఐ ప్రిన్సిపల్ నాగరాజు, అసిస్టెంట్ ట్రైనింగ్ అధికారి అశోక్, లెక్చరర్ చౌడయ్య, హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సిరాజ్, సునీల్, అబ్దుల్లా, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Namitha News